: విమానంలో సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికురాలు!
విమానాశ్రయంలోనో... విమానంలోనో ప్రయాణికులు దురుసుగా ప్రవర్తిస్తే వారిని నో ఫ్లై లిస్ట్లో చేరుస్తామని హెచ్చరిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ఆదేశాలు అమల్లోకి వచ్చిన తర్వాత తొలికేసు నమోదైంది. రాజస్థాన్లోని జయపుర నుంచి ముంబయి వచ్చే ఇండిగో విమానంలో ముంబయికి చెందిన ఆర్.ఠాకూర్ అనే మహిళ విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది.
దీంతో ఎయిర్పోర్టులో విమానం దిగిన వెంటనే ఆమెను సిబ్బంది సీఐఎస్ఎఫ్ పోలీసుల దగ్గరకు తీసుకెళ్లి కేసు నమోదు చేశారు. మరోవైపు ఆ మహిళ అధికారుల వద్ద మరో వాదనను వినిపించింది. విమాన సిబ్బందే తనతో అనుచితంగా ప్రవర్తించారని తెలిపింది. ఆ మహిళపై నిషేధం విధించారా? అనే అంశంపై స్పష్టతలేదు.