: జాతీయ రహదారిపై కంచ ఐలయ్య దిష్టి బొమ్మ దహనం... భారీగా ట్రాఫిక్ జామ్!

'సామాజిక స్మగ్లర్లు కొమటోళ్లు' అంటూ పుస్తకం రాసిన ప్రొ.కంచ ఐల‌య్యపై ఆర్య‌వైశ్యుల సంఘం మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌నకు వ్య‌తిరేకంగా వారు ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ రోజు జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు కంచె ఐలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వ‌హించారు. కంచ ఐల‌య్య‌ ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా కుల-మతాల మధ్య చిచ్చుపెట్టి శాంతిభద్రతలకు విఘాతం కల్గేలా చేస్తున్నార‌ని వారు అన్నారు. ఆయ‌న‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. త‌రువాత‌ జాతీయ రహదారపై ఐలయ్య దిష్టి బొమ్మ దహనం చేసి, రాస్తారోకో చేయ‌డంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.     

More Telugu News