akhil: 'హలో' మూవీలో మరో హీరోయిన్ కూడా ఉందట!

అఖిల్ కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'హలో' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చాలా వరకు పూర్తయింది. ఈ సినిమా ద్వారా కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా పరిచయం అవుతోంది. దర్శకుడు ప్రియదర్శన్ - నటి లిజి దంపతుల కుమార్తెనే ఈ కల్యాణి. ప్రస్తుతం ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొంటోంది.

ఈ సినిమాలో మరో కథానాయిక కూడా వుండనున్నట్టు ఒక టాక్ వినిపిస్తోంది. ఆ కథానాయిక పేరే .. నివేదితా సతీష్. జ్యోతిక ప్రధాన పాత్రను పోషించిన 'మగళిర్ మట్టుమ్' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను ఈ అమ్మాయి పోషించిందట. రెండవ కథానాయికగా ఆమెను ఎంపిక చేసుకున్నారని చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై అధికారిక సమాచారం రావలసి వుంది.   

More Telugu News