: తమిళనాట తెరపైకి మరో పార్టీ.. దసరా రోజున కమలహాసన్ పార్టీ ప్రకటన?

తమిళనాడులో మరికొన్ని రోజుల్లో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. ప్రముఖ నటుడు కమలహాసన్ విజయ దశమి, లేదంటే గాంధీ జయంతి రోజున తన రాజకీయ  పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఆ వెంటనే నవంబరులో జరగనున్న తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలహాసన్ పార్టీ పోటీ చేయనున్నట్టు సమాచారం. మొత్తంగా 4వేల మంది అభ్యర్థులను కమల్ బరిలోకి దింపనున్నట్టు తెలుస్తోంది. డీఎంకేతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలనే ఆలోచనలో కమల్ ఉన్నట్టు సమాచారం.

More Telugu News