: టీడీపీలో చేరుతున్న వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు!

అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి టీడీపీలోకి చేరేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. ఎమ్మెల్యేగా విశ్వేశ్వరరెడ్డి ఉన్నప్పటికీ, వెనక నుంచి అన్నీ చక్కబెట్టేది మధుసూదన్ రెడ్డే అనేది నియోజకవర్గ ప్రజల భావన. అయితే, గత కొంత కాలంగా ఆయనకు ప్రాధాన్యతను తగ్గించారని... అదే కుటుంబంలో ఉన్న మరో వ్యక్తి ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని... ఈ నేపథ్యంలోనే, తన రాజకీయ భవిష్యత్తు కోసం మధుసూదన్ రెడ్డి టీడీపీలో చేరాలని భావించినట్టు సమాచారం.

More Telugu News