: రూ. 246 కోట్లను డిపాజిట్ చేసిందెవరో వెల్లడించాలి: స్టాలిన్

తమిళనాడు నామక్కల్ జిల్లా తిరుచెంగోడులోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో రూ. 246 కోట్లను డిపాజిట్ చేసిన ఆ రాజకీయ నేత ఎవరో బహిర్గతం చేయాలని అన్నాడీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మీడియాను కోరారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో, వాటిని మార్చుకునేందుకు సదరు నేత ఈ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు ఐటీ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో స్టాలిన్ మాట్లాడుతూ, ఇంత పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేసిన వ్యక్తి ఎవరో ప్రజలకు తెలియాల్సి ఉందని అన్నారు. ఆ వ్యక్తి పేరును మీడియా బహిరంగపరచాలని కోరారు.

More Telugu News