: అన్నాడీఎంకే ఎమ్మెల్యేపై హైకోర్టు ఆగ్రహం.. లక్ష జరిమానా

అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్ కు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే సమయంలో, సమావేశం జరగకుండా స్టే ఇవ్వాలంటూ పిటిషన్ వేసిన దినకరన్ వర్గ ఎమ్మెల్యే పి.వెట్రివేల్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి హైకోర్టును కాకుండా, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సూచించింది. సమావేశానికి వెళ్లడం ఇష్టం లేకపోతే... ఇంట్లో కూర్చోవాలని చెప్పింది. కోర్టు సమయాన్ని వేస్ట్ చేసినందుకు లక్ష రూపాయల జరిమానా విధించింది. మరోవైపు ముఖ్యమంత్రి పదవి నుంచి పళనిస్వామిని దింపేందుకు దినకరన్ వర్గం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News