: 30 రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం!

జీఎస్టీ కారణంగా ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు శుభవార్త. 30 రకాల వస్తువుల జీఎస్టీ ధరలు తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. వీటిలో  ఇడ్లీ, దోశ పిండి, చింతపండు, రెయన్ కోట్స్, రబ్బర్ బ్యాండ్‌లు తదితర వస్తువులున్నాయి. ఇక ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) స్టోర్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో  21వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీఎస్టీ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే జీఎస్టీఆర్-1 ఫిల్లింగ్ పొడిగింపు తేదీని అక్టోబరు 10 వరకు జీఎస్టీ కౌన్సిల్ పొడిగించింది. నిజానికి ఈ గడువు నేటితో ముగియనుండగా మరో నెల రోజులు పొడిగించింది. ఇదంతా కొత్తగా ఉండడంతో ప్రజలు ఇంకా అలవాటు పడలేదని, జీఎస్టీఆర్ పొడిగింపులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగానే గడువును పొడిగించినట్టు రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా పేర్కొన్నారు.

More Telugu News