: చెప్పాపెట్టకుండా షూటింగ్ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్ పూనం కపూర్!

సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా, నిర్మాతలతో గొడవపడి, చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన నటి పూనం కపూర్ పై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయనున్నట్టు చిత్రం డైరెక్టర్ ఆండాల్ రమేష్ తెలిపారు. మరిన్ని వివరాలు చెబుతూ, రమేష్ హీరోగా, ఇద్దరు హీరోయిన్లతో తమిళంలో 'నండు' పేరిట ఓ చిత్రాన్ని ప్లాన్ చేశామని, తన కాస్ట్యూమ్స్ ను తానే డిజైన్ చేసుకుంటానని చెప్పిన ఆమె, ఖర్చు పెంచిందని, తొలి రోజు షూటింగ్ లోనే గొడవ చేసిందని, ఆపై ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోగా, తమకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని అన్నాడు. తాము ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా, ఆమె మాట్లాడలేదని చెప్పాడు. కాగా, పూనం కపూర్, నెంజి ఇరుక్కుంవరై, పయనం, ఉన్నైపోల్‌ ఒరువన్, వెడి, నాయకి తదితర చిత్రాల్లో నటించింది. ఇక తాజా ఘటనపై పూనం స్పందించాల్సి వుంది.

More Telugu News