rajani: 10 కోట్ల ఖర్చుతో '2.0' ఆడియో ఫంక్షన్!

రజనీకాంత్ కథానాయకుడిగా .. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా '2.0' తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై వున్న క్రేజ్ కి తగిన విధంగానే ఆడియో వేడుకను ఒక రేంజ్ లో నిర్వహించనున్నారు.

అక్టోబర్ 27న దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా టవర్స్ దగ్గర గల పార్క్ లో ఈ వేడుక జరగనుంది. బుర్జ్ ఖలీఫాలో ఒక భారతీయ సినిమా ఆడియో వేడుక జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ వేదికపై రెహ్మాన్ లైవ్ షో చేయనుండటం మరో విశేషం. ఆహ్వానితులను తమ సొంత ఖర్చుపై ఈ ఈవెంట్ కి తీసుకెళ్లడమే కాకుండా, వారికి బుర్జ్ ఖలీఫాలోనే బస ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఈ వేడుక కోసం ఈ సినిమా నిర్మాతలు 10 కోట్లు ఖర్చు చేస్తున్నారట.     

More Telugu News