prabhas: 'సాహో'లో శ్రద్ధా కపూర్ డ్యూయెల్ రోల్?

ప్రభాస్ తాజా చిత్రంగా దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో 'సాహో' తెరకెక్కుతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఆల్రెడీ ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ అయింది. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తుందన్నది తాజా సమాచారం. ఒక పాత్ర ప్రభాస్ జోడీగా కనిపిస్తే .. మరో పాత్ర నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తుందని అంటున్నారు.

 అయితే ఇది ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోన్న టాక్ మాత్రమే. ఈ విషయం అధికారికంగా తెలియాల్సి వుంది. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు వున్నాయి. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. మలయాళ .. కన్నడ భాషా ప్రేక్షకులను కూడా పలకరించనుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.     

More Telugu News