ntr: 'జై లవ కుశ' హిందీ డబ్బింగ్ హక్కుల రేటు అదుర్స్!

ఎన్టీఆర్ తన కెరియర్లోనే మొదటిసారిగా మూడు పాత్రలను పోషించిన 'జై లవ కుశ' చిత్రం విడుదలకి ముస్తాబవుతోంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా .. నివేదా థామస్ కథానాయికలుగా అలరించనున్నారు. భారీ బడ్జెట్ తో కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా, భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

 ఇక ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు హిందీ ఛానల్స్ లో మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయనే సంగతి తెలిసిందే. అందువల్లనే ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కుల కోసం కొన్ని టీవీ ఛానల్స్ పోటీ పడినట్టుగా సమాచారం. చివరికి ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను 'జీ సినిమా' వారు దక్కించుకున్నట్టు చెబుతున్నారు. ఇందుకోసం వాళ్లు 11 కోట్లు చెల్లించారట .. ఇది భారీ మొత్తమేనని అంటున్నారు.  

More Telugu News