shalini pande: అవి మరచిపోలేని రోజులు .. చాలాసార్లు పస్తులున్నాను : 'అర్జున్ రెడ్డి' హీరోయిన్

కొన్ని రోజులుగా యూత్ అంతా కూడా 'అర్జున్ రెడ్డి' సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా యూత్ పై అంతటి ప్రభావం చూపుతోంది. వసూళ్ల విషయంలో ఈ సినిమా అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. అలాంటి ఈ సినిమా ద్వారా షాలినీ పాండే కథానాయికగా పరిచయమైంది. మొదటి నుంచి కూడా తనకి నటన అంటే ఇష్టమనీ .. కథానాయిక కావాలనే కోరిక బలంగా ఉండేదనీ .. ఇందుకోసం తండ్రిని సైతం ఎదిరించి ఇంట్లో నుంచి వచ్చేశానని ఇటీవల ఆమె చెప్పింది.

 ఇక ఆ తరువాత తాను ఒక చిన్న గదిలో ఉంటూ చాలా దుర్భరమైన జీవితం గడిపానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఒక్కోసారి తన దగ్గర ఒక్క పైసా కూడా ఉండేది కాదనీ, అలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు పస్తులున్నానని అంది. ఎంత దూరమైనా నడిచే వెళ్లి వచ్చేదానినని  చెప్పింది. అలాంటి తనకి 'అర్జున్ రెడ్డి'లో ఛాన్స్ రావడం .. అది ఇంతటి పేరు తెచ్చిపెట్టడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది.     

More Telugu News