: 40 ఏళ్ల నుంచి నడుస్తున్న పాకిస్థాన్ బ్యాంకును మూసివేయించిన అమెరికా, రూ. 1500 కోట్ల జరిమానా

దాదాపు 40 సంవత్సరాలుగా అమెరికాలో నిర్వహిస్తున్న పాకిస్థాన్ హబీబ్ బ్యాంకును బ్యాంకుల నియంత్రణా విభాగం మూసి వేయించింది. అమెరికాలోని హబీబ్ బ్యాంకు ద్వారా ఉగ్రవాదులకు నిధులు వెళుతున్నాయన్న అనుమానం, అక్రమ నగదు లావాదేవీలపై ఎన్నోమార్లు హెచ్చరించినా, పద్ధతి మార్చుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, బ్యాంకుపై 225 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,500 కోట్లు) జరిమానా విధిస్తున్నట్టు న్యూయార్క్ బ్యాంక్ అధికారులు తెలిపారు.

పాకిస్థాన్ లో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా ఉన్న హబీబ్ బ్యాంక్, ఫిర్యాదులు, ఆరోపణలపై చర్యలు తీసుకోకపోవడం, ఉగ్రవాదానికి ప్రోత్సాహంగా నిలవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది. కాగా, 1978లో హబీబ్ తొలి శాఖ యూఎస్ లో ప్రారంభమైంది. ఈ బ్యాంకు నుంచి సౌదీ ప్రైవేట్ బ్యాంక్, అల్ రజాహీ బ్యాంక్ వంటి అల్ ఖైదా ఉగ్రవాదులతో లావాదేవీలు జరిపే బ్యాంకులకు బిలియన్ల కొద్దీ డాలర్లు వెళ్లాయని తేలినట్టు డీఎఫ్ఎస్ అధికారి మారియా ఉల్లో వెల్లడించారు.

More Telugu News