balakrishna: ఆశించిన స్థాయిలో 'పైసా వసూల్' చేయలేదట!

బాలకృష్ణ .. పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పైసా వసూల్' .. ఈ నెల 1వ తేదీన భారీస్థాయిలో విడుదలైంది. హీరోగా బాలకృష్ణకి .. దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి మాస్ ఇమేజ్ వుంది. అందువలన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది.

 దాదాపు 35 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి 5 రోజుల్లో ఈ సినిమా 14 కోట్ల 29 లక్షల షేర్ ను వసూలు చేసింది. ఇక అమెరికాలో కేవలం 42 లక్షలు మాత్రమే రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే పెట్టిన పెట్టుబడిలో సగానికి తక్కువగానే వసూళ్లు వచ్చాయి. మరో వారం రోజుల పాటు ఈ సినిమా థియేటర్స్ లో వుండే అవకాశం వుంది. అప్పుడు కూడా వసూళ్లు 16 .. 17 కోట్ల వరకూ మాత్రమే ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. దీనిని బట్టి ఈ సినిమా ఆశించిన స్థాయిలో 'పైసా వసూల్' చేయలేదని తెలుస్తోంది. 

More Telugu News