: బీహార్ లో జర్నలిస్టుపై దుండగుల కాల్పులు!

బెంగళూరులో సీనియర్ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ ను దారుణంగా  కాల్చి చంపిన  సంఘటన మరవక ముందే మరో దారుణం బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బీహార్ లోని అరవల్ లో రాష్ట్రీయ సహారా పత్రిక జర్నలిస్టు పంకజ్ మిశ్రాపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ మిశ్రా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

More Telugu News