: కాస్త తగ్గిన బంగారం, వెండి ధరలు!

బంగారం, వెండి ధరలు ఈ రోజు కాస్త త‌గ్గాయి. మూడు రోజుల పాటు ప‌సిడి ధ‌ర పెరుగుతూ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ త‌గ్గిపోవ‌డంతో బంగారం ధ‌ర‌ రూ.190 తగ్గి, పది గ్రాముల బంగారం ధర రూ.30,360 గా న‌మోదైంది. మ‌రోవైపు పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుంచి కొనుగోళ్లు లేక‌పోవ‌డంతో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.41,900గా న‌మోదైంది. ఇక గ్లోబ‌ల్ మార్కెట్లో ప‌సిడి ధ‌ర‌ 0.44 శాతం తగ్గి ఔన్సు 1,333.50 డాలర్లకు చేరింది.   

More Telugu News