: సెల్ఫీ ప్రియులకు శుభవార్త.. ‘వివో’ నుంచి మరో కొత్తఫోన్ విడుదల

సెల్ఫీ ప్రియులకు శుభవార్త. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో నుంచి మరో కొత్త ఫోన్ వచ్చింది. భారత్ మార్కెట్ లోకి ఈ ఫోన్ ను విడుదల చేసింది. ‘వీ7+’ పేరిట తయారు చేసిన ఈ కొత్త ఫోన్ ని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ నెల 15 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ప్రత్యేకతల గురించి చెప్పాలంటే..

* 24 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా
* 3225 ఎంఏ హెచ్ బ్యాటరీ
* 4 జీబీ ర్యామ్
* 5.99 టచ్ స్క్రీన్
* 24 మెగా పిక్సల్ ముందు కెమెరా
* 16 మెగా పిక్సల్  బ్యాక్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్
* ఆండ్రాయిడ్ నోగట్ 7.1 ఓఎస్
* 64 జీబీ ఇంటర్నల్ మెమురీ (అవసరమైతే 256 జీబీ వరకు పెంచుకునే సౌకర్యం) ఉన్న ఈ ఫోన్ ధర రూ.21,990

More Telugu News