: చరిత్ర పుటల్లోకి ఎక్కిన రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

భారత రక్షణ శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ నేడు బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మాజీ రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆమె తన సీటులో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రక్షణ శాఖను ఆధునికీకరించడమే తన లక్ష్యమని చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధాల తయారీని చేపట్టనున్నట్టు తెలిపారు. సైనిక దళాల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ క్రమంలో, రక్షణ శాఖ మంత్రిగా పూర్తి స్థాయి బాధ్యతలను చేపట్టిన తొలి మహిళగా నిర్మలా సీతారామన్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. గతంలో, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, రక్షణ శాఖను కొంత కాలం పాటు తన వద్దే ఉంచుకున్నారు. 

More Telugu News