allu arjun: అందుకే బన్నీని దర్శకుడు బాబీ కలిశాడట!

అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తరువాత ఆయన లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే అల్లు అర్జున్ ఖాళీ అయ్యేసరికి .. విశాల్ 'పందెం కోడి 2' కారణంగా లింగుస్వామి అందుబాటులోకి రాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.

లింగుస్వామి వెంటనే అందుబాటులోకి రాకపోతే మరో దర్శకుడితో మరో ప్రాజెక్టు చేయాలనే ఆలోచనలోనే అల్లు అర్జున్ వున్నాడని అంటున్నారు. ఈ విషయం తెలిసే బాబీ వెళ్లి అల్లు అర్జున్ ను కలిశాడని చెబుతున్నారు. 'జై లవ కుశ' రిజల్ట్ ను బట్టి బాబీకి ఏ మాటా చెబుదామనే ఉద్దేశంతో అల్లు అర్జున్ వున్నాడట. ఇక చందూ మొండేటి .. సందీప్ రెడ్డి వంగాకి కథలు రెడీ చేసుకోమని కూడా అల్లు అర్జున్ చెప్పాడట. చూడాలి మరి నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తాడో!     

More Telugu News