Shriya: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  తాజాగా 'పైసా వసూల్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందాల శ్రియ ఇప్పుడు 'వీర భోగ వసంతరాయలు' చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె ఎయిర్ హోస్టెస్ పాత్రలో కనిపిస్తుందట. అందుకోసం కాస్త ట్రైనింగ్ కూడా తీసుకుందట.
*  హాస్య కథానాయకుడు సునీల్ హీరోగా రూపొందిన 'ఉంగరాల రాంబాబు' చిత్రం సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ పొందింది. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
*  'శమంతకమణి' సినిమా తర్వాత ఆది సాయికుమార్ తాజాగా 'నెక్స్ట్ నువ్వే' చిత్రంలో నటిస్తున్నాడు. ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.
*  ప్రముఖ కవి కాళోజి నారాయణరావు పేరిట ప్రదానం చేసే అవార్డుకు ఈ ఏడాది ప్రముఖ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ ను ఎంపిక చేశారు.   

More Telugu News