ntr: 'జై లవ కుశ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేదిక ఖరారు!

'జై లవకుశ' సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులకు ఆనందాశ్చర్యాలను కలిగించనున్నాడు. ఈ సినిమా ఆడియో వేడుకను భారీగా చేయాలనుకున్నారు. అయితే వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాల వలన కుదరక, నేరుగా మార్కెట్లోకి పాటలను వదిలారు. అభిమానుల కోసం భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తామని ముందే చెప్పారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వేదిక ఖరారైంది.

ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేదికపై ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెంచేలా చూస్తున్నారు. పోస్టర్లకు .. టీజర్లకు .. ఆడియోకు ఒక రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో, సినిమాకి కూడా మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. రాశి ఖన్నా .. నివేదా థామస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఈ నెల 21న విడుదల కానుంది.    

More Telugu News