: అదృశ్యమైన సోనియాగాంధీ కమెండో.. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు!

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసం వద్ద భద్రతను పర్యవేక్షించే కమెండో రాకేశ్ కుమార్ (31) ఆచూకీ లేకుండా పోయాడు. ఈనెల 3వ తేదీ నుంచి అతని జాడలేకుండా పోయింది. ద్వారకాలో సెక్టార్ 8లో నివసిస్తున్న రాకేశ్ సెప్టెంబర్ 1న సోనియాగాంధీ నివాసం వద్ద విధులు నిర్వహించాడు. అదే రోజున అతను ఉదయం 11 గంటలకు బయటకు వెళ్లాడు. ఆ సమయంలో తన వెంట సర్వీస్ రివాల్వర్ ను, మొబైల్ ఫోన్ ను కూడా తీసుకెళ్లలేదు. సెప్టెంబర్ 2న ఇంటికి కూడా వెళ్లలేదు. దీంతో, 3వ తేదీని అతని కుటుంబసభ్యులు ఈ విషయాన్ని సోనియా సెక్యూరిటీకి తెలిపారు. ఈ నేపథ్యంలో తుగ్లక్ రోడ్ పోలీసులు అతని కోసం గాలించినప్పటికీ, ఆచూకీ లభించలేదు. మొబైల్ ఫోన్ కూడా తీసుకొని పోకపోవడంతో... అతని ఆచూకీ దొరకడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. గాలింపును ముమ్మరం చేశారు. 

More Telugu News