vijay devarakonda: విజయ్ దేవరకొండ మూవీ నుంచి తప్పుకున్న లావణ్యత్రిపాఠి!

సాధారణంగా ఒక సినిమాతో ఒక హీరో సూపర్ హిట్ కొడితే, ఆ హీరోతో నెక్స్ట్ మూవీ చేయడానికి కథానాయికలు ఉత్సాహాన్ని చూపుతుంటారు. కానీ లావణ్య త్రిపాఠి అందుకు భిన్నంగా ప్రవర్తించడం విశేషం. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో కథానాయికగా లావణ్య త్రిపాఠిని తీసుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టుగా ఆమె చెప్పిందట. దాంతో ఇప్పుడు ఈ సినిమా యూనిట్ మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టింది. లావణ్య త్రిపాఠి ఈ ప్రాజెక్టు నుంచి ఎందుకు తప్పుకుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె తాజా చిత్రంగా ఈ నెల 8వ తేదీన 'యుద్ధం శరణం' రానున్న సంగతి తెలిసిందే.  

More Telugu News