chaitu: 'యుద్ధం శరణం'తో చైతూకి మరో హిట్ దక్కేనా?

నాగచైతన్య కథానాయకుడిగా రూపొందిన 'యుద్ధం శరణం' సినిమా .. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. చైతూ ఫ్రెండ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రను పోషించాడు. ఆయన పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేశారని అంటున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాపై యూత్ లో ఆసక్తి వుంది.

 ఆంధ్ర .. తెలంగాణ రాష్ట్రాల్లో 17 కోట్లు .. ఓవర్సీస్ తో పాటు ఇతర ప్రాంతాలు కలుపుకుని మరో 3 కోట్లు థియేటర్స్ రైట్స్ బిజినెస్ చేసినట్టు చెబుతున్నారు. బడ్జెట్ ఒక పరిథిలో ఉండేలా చూసుకుంటూ ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మించాడు. అందువలన పాజిటివ్ టాక్ వస్తే చాలు .. హిట్ వైపుకు పరుగులు తీయడం .. లాభాలు రావడం ఖాయమని అంటున్నారు. 'ప్రేమమ్' .. 'రారండోయ్ వేడుక చూద్దాం'తో సక్సెస్ లను అందుకున్న చైతూ, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.     

More Telugu News