chiranjeevi: చిరంజీవి విడుదల చేసిన 'ఇంద్రసేన' ఫస్టులుక్!

రాధికా శరత్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తూ తమిళంలో 'అన్నాదురై' సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ద్వారా శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తెలుగులో ఈ సినిమాను 'ఇంద్రసేన' పేరుతో విడుదల చేయనున్నారు. తెలుగు ఫస్టులుక్ ను చిరంజీవి చేతుల మీదుగా ఈ రోజు ఉదయం ఆవిష్కరింపజేశారు.

 ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ .. తనకి ఎంతో ఆప్తురాలైన రాధిక నిర్మిస్తోన్న ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. సంగీత దర్శకుడైన విజయ్ ఆంటోని కథానాయకుడిగా తన సత్తా చాటుకున్నాడనీ, ఈ సినిమాకి ఆయన ఎడిటింగ్ కూడా చేస్తుండటం విశేషమని అన్నారు. ఆయన ప్రయత్నం సక్సెస్ కావాలని ఆశిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.     

More Telugu News