shriya: శ్రియకు మళ్లీ టైమ్ వచ్చిందా?

తెలుగు .. తమిళ భాషల్లో నిన్నటి తరం కథానాయికగా శ్రియ ఒక వెలుగు వెలిగింది. ఈ రెండు భాషల్లోని స్టార్ హీరోలతో ఆమె జోడీ కట్టింది. కొత్త కథానాయికల రాకను తట్టుకుంటూనే సుదీర్ఘ కాలంగా తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తోంది. సీనియర్ కథానాయకుల సరసన కథానాయిక కావాలంటే శ్రియ పేరునే ముందుగా పరిశీలిస్తున్నారు. అందుకు కారణం ఇప్పటికీ ఆమె గ్లామర్ లో పెద్దగా మార్పు లేకపోవడమే.

 శ్రియ పనైపోయిందని అంతా అనుకునే సమయంలో ఆమెకి 'మనం' సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ తరువాత చేసిన 'శాతకర్ణి' .. రీసెంట్ గా చేసిన 'పైసా వసూల్' కూడా శ్రియ క్రేజ్ ను నిలబెట్టాయి. ప్రస్తుతం ఆమె 'వీరభోగ వసంతరాయలు' సినిమా చేస్తోంది. నారా రోహిత్ .. సుధీర్ బాబు ప్రధానమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాలో, కీలకమైన పాత్రలో శ్రియ కనిపించనుందట. ఇదంతా చూస్తుంటే ఇప్పుడు శ్రియ టైమ్ నడుస్తోందని అనిపించడం లేదూ. 

More Telugu News