vijay devarakonda: 'అర్జున్ రెడ్డి' కోసం 40 నిమిషాల కొత్త సీన్స్?

'అర్జున్ రెడ్డి' సినిమా నిడివి 3 గంటలు అనే విషయం విడుదలకి ముందు తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో ఇంత నిడివి కలిగిన సినిమాను ప్రేక్షకులు చూస్తారా? అనే సందేహాలను వ్యక్తం చేశారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులెవరూ నిడివి పట్ల ఎలాంటి అభ్యంతరాలను తెలియజేయలేదు. యూత్ అంతా కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి కొత్తగా కొన్ని సీన్స్ కలపాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.

ఇంకా తమ దగ్గర 40 నిమిషాల నిడివి కలిగిన పుటేజ్ ఉందనీ, దానిని కూడా సినిమాకి కలపాలనుకుంటున్నామని విజయ్ దేవరకొండ తాజాగా చెప్పాడు. కథకు ఈ పుటేజ్ కూడా చాలా అవసరమనీ, ఆడియన్స్ తప్పకుండా కొత్త సీన్స్ ను కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉందని చెప్పాడు. ఇక ఈ కొత్త సీన్స్ ను ఎప్పటి నుంచి యాడ్ చేస్తారనేది చూడాలి.              

More Telugu News