puri: ముందుగా ఆకాశ్ తో .. ఆ తరువాత మళ్లీ బాలయ్యతో!: పూరి

బాలకృష్ణ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'పైసా వసూల్' భారీ ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. పూరి ఆశించిన స్థాయిలోనే ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో పూరీ నెక్స్ట్ మూవీ ఆయన కుమారుడు ఆకాశ్ తో ఉంటుందనే టాక్ బయటికి వచ్చింది. అది నిజమేననే విషయాన్ని తాజాగా పూరీ జగన్నాథ్ చెప్పాడు.

 ఆకాశ్ ను రెండేళ్లు ఆగిన తరువాత హీరోగా పరిచయం చేయాలనుకున్నాననీ, కానీ ఆ తరువాత తన నిర్ణయం మార్చుకున్నానని అన్నాడు. ఆకాశ్ హీరోగా అక్టోబర్ లో సినిమాను మొదలెడతానని చెప్పాడు. మూడు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేసి .. కొత్త సంవత్సరంలో విడుదల చేస్తానని అన్నాడు. ఈ సినిమా తరువాత జనవరి నుంచి బాలకృష్ణ 103వ సినిమా చేయనున్నట్టు చెప్పాడు. ఈ రెండు సినిమాలకి సంబంధించిన పనుల్లో తాను ఉన్నట్టుగా చెప్పుకొచ్చాడు. 

More Telugu News