kajal: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  'మరో ఏభై సినిమాలైనా చేయాలని వుంది..' అంటోంది అందాలభామ కాజల్ అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ ఇటీవల నటించిన 'నేనే రాజు.. నేనే మంత్రి' చిత్రం ఆమెకు ఏభయ్యవది. ఈ నేపథ్యంలో చెబుతూ, 'ఈ ఏభై సరిపోవడం లేదు. మరో ఏభై చేయాలని వుంది. సినిమా చేయడమనేది ఓ వ్యసనంలా మారిపోయింది. పని లేకుండా ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండలేను' అని చెప్పింది కాజల్ నవ్వుతూ.      
*  మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కథానాయికగా ఇలియానాను ఎంపిక చేసినట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఇందులో వాస్తవం లేదని, అసలు ఇలియానాను తాము సంప్రదించలేదని చిత్ర నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు.
*  మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న 'ఒక్కడు మిగిలాడు' చిత్రం విడుదలలో కాస్త జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇందులో కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా ఉన్నందున ప్రస్తుతం వాటి పని జరుగుతోందని, దీంతో విడుదలలో కాస్త జాప్యం జరగచ్చని యూనిట్ చెబుతోంది. అజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనీషా ఆంబ్రోస్ కథానాయికగా నటించింది.
*  ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన 'శ్రీవల్లి' చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. దీంతో ఈ నెల 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.   

More Telugu News