: తెలంగాణ సచివాలయం నిర్మాణానికి భూమి ఇవ్వకండి: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు వీహెచ్ లేఖ

కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు లేఖ రాశారు. సచివాలయం నిర్మాణం కోసం సికింద్రాబాద్ లోని బైసన్ పోలో గ్రౌండ్ ను ఇవ్వద్దని లేఖలో ఆయన కోరారు. బైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయం నిర్మించాలనేది ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. కేసీఆర్ డైలాగులు సినిమాలకు పనికొస్తాయని, నిజ జీవితంలో పనికిరావని చెప్పారు. 

More Telugu News