rajani: రజనీ సినిమాలోని ఒక్క పాట కోసం కోట్లు కుమ్మరించారట!

రజనీకాంత్ అభిమానులంతా '2.0' సినిమా కోసం ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను జనరంజకంగా తీర్చిదిద్దడంలోనే శంకర్ నిమగ్నమై వున్నాడు. ఈ సినిమా కోసం ఎ.ఆర్. రెహ్మాన్ 5 పాటలను స్వరపరిచాడు. అయితే ఆల్బంలో 5 పాటలు ఉంటాయట గానీ, సినిమాలో మాత్రం రెండు పాటలు మాత్రమే కనిపిస్తాయట. కథకి అడ్డుతగులుతాయనే ఉద్దేశంతో శంకర్ రెండు పాటలను మాత్రమే చిత్రీకరించినట్టు తెలుస్తోంది.

 ఈ రెండు పాటల చిత్రీకరణకు గాను కొన్ని కోట్లు కుమ్మరించారట. ఇందులో ఒక పాటను .. భారతీయ సినీ చరిత్రలోనే గ్రాండుగా తెరకెక్కించారని అంటున్నారు. కథ .. కథనాల కారణంగా, ఈ రెండు పాటల చిత్రీకరణ కారణంగా ప్రేక్షకులు సంతృప్తి చెందుతారట. రెండు పాటలేనా అని ఎవరూ అసంతృప్తిగా ఫీలయ్యే చాన్సే వుండదని టాక్. ఆ పాటలు చేసే పండుగ ఎలా ఉంటుందనేది సినిమా రిలీజ్ అయితేనే గాని తెలియదు.      

More Telugu News