: హిందీ పాట పాడుతున్న చైనా జర్నలిస్ట్.... వీడియో చూడండి!
చైనాలోని గ్జియామెన్లో జరుగుతున్న బ్రిక్స్ 2017 సమావేశాల మీడియా పాయింట్ వద్ద హిందీ పాట పాడి ఓ చైనా జర్నలిస్ట్ అందరి మనసులను దోచుకుంది. చైనా రేడియో జర్నలిస్ట్ టాంగ్ యువాంగై 1979లో వచ్చిన `నూరీ` చిత్రంలోని `ఆజా రే ఓ మేరే దిల్బర్ ఆజా` పాట పాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సినిమాలో ఈ పాటను నితిన్ ముకేష్, లతా మంగేష్కర్ పాడగా ఫరూక్ షేక్, పూనం థిల్లాన్లు నటించారు.