balakrishna: బాలకృష్ణ మూవీ కోసం నయనతారతో పాటు మరో కొత్త హీరోయిన్!

బాలకృష్ణ 102వ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. దర్శకుడు కె. ఎస్. రవికుమార్ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉండనున్నారు. ఒక కథానాయికగా నయనతారను ఎంపిక చేసుకున్నారు. ఆల్రెడీ ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొంటోంది.

ఇక రెండవ కథానాయికగా 'నటాషా దోషి'ని ఎంపిక చేసినట్టుగా సమాచారం. కథానాయికగా నటాషా దోషికి మలయాళంలో మంచి గుర్తింపు వుంది. 'హైడ్ అండ్ సీక్' .. 'మాంత్రికన్' .. 'నయన' .. 'కాల్ మీ @' .. 'ఫర్ సెల్' వంటి సినిమాలు ఆమెకి ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టాయి. బాలకృష్ణ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయమవుతోంది. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. ఇక మూడవ కథానాయికగా ఎవరిని తీసుకుంటారో చూడాలి.     

More Telugu News