balakrishna: 'పైసా వసూల్'తో పూరి తేరుకున్నట్టేనట!

'పైసా వసూల్' సినిమా పూరి కెరియర్లో చాలా కీలకంగా మారింది. ఈ సినిమాతో తప్పకుండా ప్రేక్షకులను మెప్పించవలసిన బాధ్యత ఆయనపై పడింది. ఎందుకంటే ఈ సినిమాకి ముందు ఆయన తెరకెక్కించిన 'జ్యోతి లక్ష్మి' .. 'లోఫర్' .. ' ఇజం' .. 'రోగ్' చిత్రాలు భారీ పరాజయాలను చవి చూశాయి.

ఇక ఈ సినిమాకి ముందు బాలకృష్ణ 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాతో భారీ హిట్ కొట్టి వున్నారు. అందువలన ఆయన అభిమానులు నిరాశ పడకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా పూరిపై వుంది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆయన కొన్ని ఆరోపణలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇలా వివిధ కారణాల వలన మానసిక పరమైన ఒత్తిడి ఎక్కువగా వున్నా, మంచి అవుట్ పుట్ తో పాటు భారీ ఓపెనింగ్స్ ను తీసుకురాగలిగాడు. ఈ సినిమా టాక్ .. వసూళ్లు చూసిన వాళ్లు పూరి తేరుకున్నట్టేనని చెప్పుకుంటున్నారు. 

More Telugu News