sandeep reddy: 'అర్జున్ రెడ్డి' దర్శకుడి నెక్స్ట్ మూవీ 'షుగర్ ఫ్యాక్టరీ'?

'అర్జున్ రెడ్డి' సినిమాను తెరకెక్కించడానికి నిర్మాతలెవరూ ముందుకు రాకపోవడంతో, తన అన్నయ్యే నిర్మాతగా రంగంలోకి దిగాడని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో, ఆయన తదుపరి సినిమా ఏదైనా తాము నిర్మిస్తామంటూ చాలామంది నిర్మాతలు ముందుకు వస్తున్నారట.

అయితే సందీప్ రెడ్డి తదుపరి సినిమా కూడా కొత్తగా .. ఒక ప్రయోగంలా ఉంటుందని సమాచారం. ఈ సినిమా పేరు 'షుగర్ ఫ్యాక్టరీ' అనీ .. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగుతుందని అంటున్నారు. అందువలన ఈ సినిమాకి తానే నిర్మాతగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఆయన వున్నట్టుగా చెబుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించడానికి ఆయన సిద్ధమవుతున్నాడని అంటున్నారు. 

More Telugu News