: అన్న ప్రొడ్యూసర్.. తమ్ముడు ఆర్టిస్ట్!: నందమూరి హరికృష్ణ

‘అన్న ప్రొడ్యూసర్.. తమ్ముడు ఆర్టిస్ట్’ గా రూపొందించిన చిత్రం ‘జై లవ కుశ’ అంటూ తన కుమారులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ గురించి నందమూరి హరికృష్ణ ఆనందంగా చెప్పారు. హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో ‘జై లవ కుశ’  ఆడియో సీడీ ఆవిష్కరణ జరిగింది.

 ఈ కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ, ఈ సినిమా గురించి వినగానే తన తండ్రి ఎన్టీఆర్ నాడు నటించిన ‘లవకుశ’ చిత్రం గుర్తుకు వస్తోందని అన్నారు. ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో ‘జై లవ కుశ’ నిర్మాత కళ్యాణ్ రామ్, దర్శకుడు బాబీ, హీరోయిన్ రాశీఖన్నా, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, పాటల రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, మాటల రచయిత కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
 

More Telugu News