: కోయంబత్తూరులో ‘ర్యాలీ ఫర్ రివర్స్’ను ప్రారంభించిన జగ్గీ వాసుదేవ్!

తమిళనాడులోని కోయంబత్తూరులో ‘ర్యాలీ ఫర్ రివర్స్’ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లోని 21 నగరాల్లో జగ్గీ వాసుదేవ్ పర్యటించనున్నారు. నదులను కాపాడుకునే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ‘ర్యాలీ ఫర్ రివర్స్’ నేటి నుంచి అక్టోబర్ 3 వరకు కొనసాగనుంది. కాగా, ‘ర్యాలీ ఫర్ రివర్స్’ కు మద్దతు ఇద్దామంటూ ప్రముఖ నటుడు చిరంజీవి నిన్న తన వీడియో సందేశంలో పిలుపు నిచ్చారు. నదులు ఎన్నో తరాలుగా మనల్ని పోషిస్తున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.

More Telugu News