: ఉత్తరకొరియా మరో అణుపరీక్ష నిర్వహించింది: దక్షిణ కొరియా, జపాన్

ఉత్తరకొరియా మరో అణు పరీక్ష నిర్వహించిందని దక్షిణ కొరియా వెల్లడించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేశామని, దానిని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పరిశీలించారని చెబుతూ ఫోటోలు విడుదల చేసింది. అలా విడుదల చేసిన కొన్ని గంటల్లోనే అణుపరీక్షను ఉత్తరకొరియా నిర్వహించిందని దక్షిణ కొరియా తెలిపింది.

అణు పరీక్షల నేపథ్యంలో ఉత్తరకొరియాలోని ఈశాన్య ప్రాంతమైన సున్‌ గ్జిబేగమ్‌ లో 5.1 తీవ్రతతో పేలుడు సంభవించిందని దక్షిణకొరియా తెలిపింది. ఈ పేలుడు ధాటికి ఉత్తరకొరియాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించిందని దక్షిణ కొరియా వెల్లడించింది. దీనిని జపాన్ నిర్ధారించింది. దీంతో ఉత్తరకొరియా ఇప్పటి వరకు ఆరు అణు పరీక్షలు నిర్వహించినట్టైంది. గత ఏడాది రెండు అణుపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

More Telugu News