: ‘జై బాలయ్య’ నినాదాన్ని ‘జైహింద్’తో ఎలా పోలుస్తారంటూ కీరవాణిపై మండిపడ్డ నెటిజన్లు!

బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నిన్న విడుదలైన చిత్రం ‘పైసా వసూల్’. ‘పైసా వసూల్’ థియేటర్లలో బాలయ్య అభిమానులు ‘జై బాలయ్య’ అంటూ ఎంతో ఉత్సాహంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇంతకీ, కీరవాణి చేసిన ఆ ట్వీట్ ఏంటంటే..‘‘జైహింద్’ అన్నంత ఆనందంగా, ఉత్సాహంగా ‘జై బాలయ్య’ అని నినదిస్తున్నారు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించడమే కాకుండా, నెటిజన్లలో కొందరు కుల ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. దీనిపై, కీరవాణి ఘాటుగా స్పందించారు. ‘అర్జున్ రెడ్డి’ యూనిట్ ను కులం కోసమే తాను ప్రశంసించానా? అని ప్రశ్నించారు. ఫేక్ డిస్ ప్లే పిక్ (డీపీ) పెట్టుకునే వీధి కుక్కలు తన దేశభక్తి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ కీరవాణి ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది.

More Telugu News