: బీహార్ లో కాంగ్రెస్ కు షాక్.. 14 మంది ఎమ్మెల్యేలు జంప్?

బీహార్ లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలనుంది. గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది. బీజేపీతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జట్టు కట్టడంతో... పరిస్థితి తలకిందులైంది. ఈ నేపథ్యంలో, ఆ పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ పార్టీ జేడీయూలో చేరబోతున్నారనే విషయం కాంగ్రెస్ పెద్దలను కలవరపాటుకు గురి చేస్తోంది.

దీంతో, బీహార్ కీలక నేతలను ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఢిల్లీకి పిలిపించుకున్నారు. వీరితో సోనియాతో పాటు గులాం నబీ అజాద్, అహ్మద్ పటేల్, సీపీ జోషీలు కూడా మాట్లాడారు. పార్టీ నుంచి వలసలను ఎలాగైనా ఆపాలని సూచించారు. ప్రస్తుతం బీహార్ లో కాంగ్రెస్ పార్టీకి 27 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు.  

More Telugu News