: విజయవాడ రైల్వే స్టేషన్ లో 13 కేజీల బంగారం పట్టివేత!

విజయవాడ రైల్వే స్టేషన్‌ లో భారీ మొత్తంలో బంగారం పట్టుబడడం కలకలం రేపుతోంది. హౌరా నుంచి తిరుచురాపల్లి వెళ్తున్న ట్రైన్ లో తరలిస్తున్న ఈ బంగారాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారంతో పాటు ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా ప్రయాణిస్తుండడంతో వారిని అదుపులోకి తీసుకున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

More Telugu News