srivishnu: ఆకట్టుకుంటోన్న 'మెంటల్ మదిలో' ట్రైలర్

శ్రీవిష్ణు కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'మెంటల్ మదిలో' సినిమా రూపొందింది. ఈ సినిమా ద్వారా 'నివేతా పేతురాజ్' కథానాయికగా పరిచయమవుతోంది. 'పెళ్లి చూపులు' నిర్మాత రాజ్ కందుకూరి ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.

నాయకా నాయికల మధ్య ప్రేమ .. ఘర్షణకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ ద్వారా కంటెంట్ ను చెబుతూనే ఆసక్తిని రేకెత్తించారు. యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందనే విషయం ఈ ట్రైలర్ తో అర్థమైపోతోంది. త్వరలోనే ఆడియోను రిలీజ్ చేసి .. అదే రోజున సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారట. 'పెళ్లి చూపులు' తరహాలోనే ఈ సినిమా ఆదరణ పొందుతుందనే నమ్మకంతో దర్శక నిర్మాతలు వున్నారు

More Telugu News