vijay devarakonda: 'అర్జున్ రెడ్డి'కి 15 నిమిషాల సీన్స్ ను జోడిస్తారట!

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'అర్జున్ రెడ్డి' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షాలిని పాండే కథానాయికగా నటించిన ఈ సినిమా, వసూళ్ల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. మొదట ఈ సినిమా నిడివి 3 గంటల 15 నిమిషాలు వుండేదట. అయితే ఆడియన్స్ బోర్ ఫీలయ్యే ఛాన్స్ ఉందని భావించి, 15 నిమిషాల నిడివిని తగ్గించి వదిలారు.

ఈ సినిమా 3 గంటల పాటు ఉన్నప్పటికీ యూత్ ఎంత మాత్రం బోర్ ఫీలవ్వకుండా చూస్తున్నారట. దాంతో తాము ముందుగా అనుకున్న 15 నిమిషాల సీన్స్ ను కూడా కలిపితే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడని సమాచారం. ఆ 15 నిమిషాల పుటేజ్ ను యాడ్ చేయడం వలన మరింత ఫీల్ వస్తుందని చెబుతున్నాడట. అయితే ఈ 15 నిమిషాల పుటేజ్ ను వెంటనే యాడ్ చేద్దామా? .. లేదంటే కొన్ని రోజులు వెయిట్ చేద్దామా? అనే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది.

More Telugu News