: భార్యను హతమార్చి 70 ముక్కలు చేసిన ‘టెక్కీ’ భర్తకు నేడు శిక్ష ఖరారు

సుమారు ఏడేళ్ల క్రితం.. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన భార్యను దారుణంగా హత్య చేసిన కేసులో దోషికి ఈ రోజు శిక్ష ఖరారు కానుంది. 2010 అక్టోబర్ 17వ తేదీ రాత్రి ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఈ దారుణ సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాజేశ్, తన భార్య అనుపమ (36)తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన రాజేశ్, ఆమెను హత్య చేశాడు. కాగా, 1999లో వివాహం చేసుకున్న రాజేశ్-అనుపమ, ఆ తర్వాత అమెరికా వెళ్లారు. 2008లో తిరిగి డెహ్రాడూన్ వచ్చారు. అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరిగాయి.

 కోల్ కతాకు చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ రాజేశ్ ను అనుపమ నిలదీస్తుండేది. ఈ క్రమంలో వారి మధ్య గొడవలు జరగడం, చివరకు, అనుపమ హత్యకు గురి కావడం జరిగింది. ఆమెను హత్య చేసిన అనంతరం, 70 ముక్కలుగా చేసి వాటిని పాలథీన్ కవర్లలో ఉంచి డీప్ ఫ్రీజర్ లో ఉంచాడు. రోజుకో పాలథిన్ కవర్ ను బయటకు తీసుకువెళ్లి పారేసేవాడు. ఈ విధంగా నగర శివార్లలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. అనుపమ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజేశ్ ఇంట్లో సోదాలు చేయడంతో అసలు విషయం బయటపడింది.

More Telugu News