balakrishna: ఆ నిర్ణయమే 'పైసా వసూల్' కి బాగా కలిసొచ్చిందట!

బాలకృష్ణ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పైసా వసూల్' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలోను థియేటర్ల దగ్గర భారీగా సందడి కనిపిస్తోంది. విడుదలకి ముందు ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోవడం ఇందుకు కారణమని చెప్పుకుంటున్నారు.

 మొదట్లో ఈ సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ సెప్టెంబర్ 21వ తేదీన 'జై లవ కుశ' .. సెప్టెంబర్ 27న 'స్పైడర్' సినిమాలు విడుదలకి సిద్ధమయ్యాయి. ఇలా పోటీలో రంగంలోకి దిగితే థియేటర్ల సమస్య తలెత్తుతుందనే ఉద్దేశంతో ఈ సినిమాను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇన్ని రోజుల ముందుకు జరపడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడలా తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు ఈ సినిమాకి కలిసొచ్చిందని థియేటర్స్ దగ్గర సందడి చూసిన వాళ్లు చెప్పుకుంటున్నారు.      

More Telugu News