: ముషారఫ్ పరారీలో ఉన్న నేరస్థుడు, అతని ఆస్తులు స్వాధీనం చేసుకోండి: పాక్ కోర్టు ఆదేశం

పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ కు ఉగ్రవాద వ్యతిరేక కోర్టు షాక్ ఇచ్చింది. 27 డిసెంబర్ 2007లో హత్యకు గురైన పాక్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో కేసుకు సంబంధించి ముషారఫ్‌ పరారీలో ఉన్న నేరస్తుడని ఆ కోర్టు స్పష్టం చేసింది. ఈ హత్య కేసు నమోదైన అనంతరం దీని విచారణలో 8 మంది జడ్జిలు మారారు. ఎట్టకేలకు జడ్జి అస్గర్ ఖాన్ తీర్పుచెప్పారు.

ఈ కేసులో పర్వేజ్ ముషారఫ్ తో పాటు రావల్పిండి మాజీ సీపీవో సాద్‌ అజీజ్, రావల్‌ టౌన్‌ ఎస్పీ ఖుర్రమ్‌ షెహజాద్‌ లను న్యాయస్థానం దోషులుగా ప్రకటించింది. ఈ సందర్భంగా ముషారఫ్ పరారీలో ఉన్న నేరస్థుడని, అతని ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మిగిలిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులకు 17 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరూ 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. వైద్యపరీక్షల పేరుతో గత ఏడాది దుబాయ్ కు పారిపోయిన ముషారఫ్ ఇంకా స్వదేశం చేరలేదు. 

More Telugu News