: నా మనవడు నా పేరే మర్చిపోయాడు: నటుడు బాలకృష్ణ

తన మనవడు చిన్నారి దేవాన్ష్ తన పేరే మర్చిపోయాడని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘మనవడు దేవాన్ష్ ను ‘నా పేరేంటిరా? అని అడిగితే..‘శాతకర్ణి’ అని, లేకపోతే ‘గోల తాత’ అంటాడు’ అని చెబుతూ బాలయ్య నవ్వులు చిందించారు.

బాలయ్య తన అభిమానిపై చేయిచేసుకున్న సందర్భాన్ని ప్రస్తావించగా, ‘నా చేయి తగలడం అభిమానులు ప్రేమగా భావిస్తారు. అతిగా చేస్తే తప్పా, నేను చేయి చేసుకోను. నా అభిమానులకు నాకు మధ్య ఎవరైనా వస్తే దబిడిదిబిడే’ అని చెప్పుకొచ్చారు. కాగా, దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘పైసా వసూల్’ చిత్రం రేపు విడుదల కానుంది.



More Telugu News