vijay devarakonda: 'అర్జున్ రెడ్డి' దూకుడును 'పైసా వసూల్' ఆపేనా?

మొదటి నుంచి కూడా 'అర్జున్ రెడ్డి' సినిమా గురించిన టాక్ యూత్ లో నడుస్తూనే వుంది. ఈ సినిమా విడుదలైన తరువాత ఇక యూత్ లో దాని గురించిన చర్చ మాత్రమే నడుస్తోంది. ఇప్పటికే 15 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా, 25 కోట్ల షేర్ ను రాబట్టే దిశగా పరుగులు తీస్తోంది.

 అయితే రేపు 'పైసా వసూల్' సినిమా థియేటర్లలోకి దిగిపోనుంది. పూరి .. బాలకృష్ణ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగానే జరుగుతున్నాయని అంటున్నారు. అందువలన 'అర్జున్ రెడ్డి' వసూళ్లపై 'పైసా వసూల్' ప్రభావం చూపించే ఛాన్స్ ఉందని టాక్. అయితే అమెరికాలో మాత్రం 'అర్జున్ రెడ్డి' హవానే కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.    

More Telugu News