sandeepkishan: 'నక్షత్రం' నిర్మాతలకు నిజంగానే చుక్కలు చూపించిందట!

కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నక్షత్రం' మూవీ ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్ కిషన్, రెజీనా, సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రలుగా ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు 22 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. వివిధ కారణాల వలన ఈ సినిమా నిర్మాణంలో జరిగిన జాప్యం ప్రభావం సహజంగానే విడుదలపై పడింది.

ఎందుకనో గానీ మొదటి నుంచి కూడా ఈ సినిమాకి హైప్ రాలేదు. రిలీజ్ తరువాత జనం ఎక్కువగా మాట్లాడుకోనూ లేదు. ఫుల్ రన్ పూర్తయిన తరువాత ఈ సినిమా వసూలు చేసింది కేవలం 4 కోట్ల 16 లక్షలు మాత్రమే. ఓవర్సీస్ లో ఈ సినిమా 3 లక్షలు మాత్రమే రాబట్టిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 3 కోట్లకు అమ్ముడు కావడం నిర్మాతలకి కొంతలో కొంత ఊరట అనే చెప్పాలి.        

More Telugu News